యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఇప్పటికే థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సందడి మొదలైపోయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్కి ముందే నైజాంలో ఆల్టైమ్ రికార్డ్ సెట్ చేసింది. హైదరాబాద్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ రూ.6.5 కోట్ల మార్క్ దాటింది. ఇది డే1 ఆల్టైమ్ రికార్డ్ అని చెప్పాలి. దీనిని బట్టి చూస్తుంటే రిలీజ్కి ముందే రాధేశ్యామ్ ఇలా రికార్డులు సాధిస్తుందంటే, రాబోయ్యే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను నెలకొల్పుతుందో చూడాలి మరీ.