షాకింగ్ : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నుంచి సంచలన ప్రెస్ నోట్.!

షాకింగ్ : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నుంచి సంచలన ప్రెస్ నోట్.!

Published on Mar 12, 2022 5:10 PM IST


మన టాలీవుడ్ కి చెందినటువంటి ఎందరో ప్రముఖమైన నిర్మాతల్లో బెల్లంకొండ సురేష్ కూడా ఒకరు. నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద ఎన్నో సినిమాలు చేశారు. అలాగే తన ఇద్దరు కొడుకులు బెల్లంకొండ శ్రీనివాస్ ఆల్రెడీ మంచి హీరోగా సెటిల్ అవ్వగా మరో కుమారుడు బెల్లంకొండ గణేష్ కూడా సినిమా ఎంట్రీ తో రెడీగా ఉన్నాడు.

మరి ఇదిలా ఉండగా తమ కుటుంబంపై శరన్ అనే వ్యక్తి కావాలనే పలు ఆరోపణలు చేసి నన్ను నా పిల్లలని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని షాకింగ్ ప్రెస్ నోట్ తో నిర్మాత బెల్లంకొండ సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ప్రెస్ నోట్ లో తన మాటలు ఏమిటంటే..

“నన్ను నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగమే నా పై నమోదు అయిన కేసు నాకు శరన్ ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. నా పై నా కొడుకు పై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

శరన్ ఒక్క పైసా మాకు ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. శరన్ తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు. నేను డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా. బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారు. పోలీసుల విచారణకు సహరిస్తా.

85 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఆరోపణలు చేశారు. కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడు.. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చారు. నా పిల్లలు జోలికి వచ్చాడు… నా పిల్లలు నా పంచ ప్రాణాలు శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటా అతని పై పరువు నష్టం దావా వేస్తా, ఏదన్నా ఆధారాలు ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి…

నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదు, నా పై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారు… పై ఆధారాలు ఇవ్వాలని శరణ్ కు నోటీసులు ఇచ్చారు. శరణ్ ది మా ఊరే… పదేళ్ళ క్రితం పరిచయం.. టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడు. శరణ్ అనవసరంగా నా కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడు.. అతని క్షమించమని వేడుకున్నా నేను ఊరుకోను. బ్లాక్ మెయిల్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు… శరణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు.. అతనెవరో బయట పెడతా…” అని తాను షాకింగ్ నిజాలు చెప్పుకొచ్చారు. దీనితో ఇండస్ట్రీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు