“ఆవేశం” చిత్రంపై నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు!

“ఆవేశం” చిత్రంపై నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు!

Published on Apr 30, 2024 6:09 PM IST


ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మాలీవుడ్ చిత్రం ఆవేశం. జిత్తు మాధవన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. కొన్ని రోజుల క్రితం, సమంత మరియు చైత్ర జె ఆచార్, ఇతర ప్రముఖులతో పాటు, ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ లిస్ట్ లో చేరింది.

ఆవేశం ఈ దశాబ్దపు సినిమా విజయం. జిత్తు మాధవన్ రచనలోని యుక్తి, భవిష్యత్ కమర్షియల్ చిత్రాలకు హద్దులు ఏర్పరచింది. తనకి ఈ చిత్రం బాగా నచ్చింది అని తెలిపింది. అంతేకాక ఫాఫా – సూపర్ స్టార్ అంటూ పేర్కొంది. కిల్లర్ పెర్ఫార్మెన్స్, మాస్, ప్రతి బిట్‌ను ఇష్టపడ్డాను. సినిమా వెనుక ఉన్న మొత్తం బృందాన్ని కూడా ఆమె మెచ్చుకుంది.

ఆవేశం ఇప్పటికీ చాలా ఏరియాల్లో థియేటర్లలో డీసెంట్ రన్ అవుతోంది. అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్, ఫాహద్ ఫాజిల్ మరియు ఫ్రెండ్స్ నిర్మించిన ఈ చిత్రంలో హిప్‌స్టర్, రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించగా, సుశీన్ శ్యామ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు