క్రేజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ పై ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘ఆచార్య’ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించిందట. కథను మలుపుతిప్పే క్యారెక్టర్లో అనసూయ కనిపించబోతుందట. ఆమె పాత్రకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సినిమా కోసం ఆమె రూ.25 లక్షల వరకు పారితోషకం తీసుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇక ఈ భారీ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్లు గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించారు. ఏది ఏమైనా ప్రస్తుతం అనసూయ సినీ కెరీర్ పుల్ స్వింగ్లో ఉంది. అటు స్మాల్ స్క్రీన్ పై యాంకరింగ్ తో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఇటు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో డిఫరెంట్ పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది.