మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య నుండి ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ టీజర్, అలానే ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ అందరి నుండి భారీ రెస్పాన్స్ అందుకుని మూవీ పై ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఆర్ధర్ ఏ విల్సన్ ఫోటోగ్రఫి అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇక వాల్తేరు వీరయ్య నుండి నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవిని అవుతా అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని నేడు సాయంత్రం 4 గం. 5 ని. లకు విడుదల చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు మేకర్స్. అయితే కొద్దిసేపటి క్రితం వారి నుండి వచ్చిన అప్ డేట్ ప్రకారం ఈ సాంగ్ కొంత ఆలస్యంగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. టెక్నీకల్ గ్లిచ్ కారణంగా సాంగ్ రిలీజ్ మరికొంతసేపు వాయిదా పడిందని, ఫ్యాన్స్ అలానే అర్ధం చేసుకుని మరికొద్దిసేపు వెయిట్ చేస్తారని ఆశిస్తున్నట్లు యూనిట్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపింది. కాగా వాల్తేరు వీరయ్య మూవీ 2023 జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Due to a technical glitch, #SrideviChiranjeevi song from #WaltairVeerayya is slightly delayed ⏳
Trust us, the wait will be worth it ????
Vintage Chiru grace loading ❤️????????
— Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2022