పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీ తెరకెక్కిస్తున్నారు మారుతీ. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం కనపడుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈమూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
కాగా ఇటీవల నిర్మాత ఎస్ కె ఎన్ తో కలిసి తమిళ మూవీ ట్రూ లవర్ కి తెలుగులో సమర్పకుడిగా వ్యవహరించారు మారుతీ. ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. విషయం ఏమిటంటే, త్వరలో ఆర్ వి సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో జీ స్టూడియోస్, ఆ విజయపాల్ రెడ్డితో కలిసి బ్యూటీ అనే మూవీ నిర్మించనున్నారు మారుతీ. ఇక ఏప్రిల్ 22 న ఈ మూవీ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ కానుంది. త్వరలో ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.