సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘2.0’ రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం 3కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈచిత్రం 5 రోజులకు గాను ఏపీ మరియు తెలంగాణ లో 36.35కోట్ల షేర్ వసూళ్లను కలెక్ట్ చేసింది. అయితే ఈ చిత్రం ఆక్కడ 70కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా మరి ఆ మొత్తాన్ని రాబట్టాలంటే మరో మూడు వారాలు ఇదే రన్ ను కొనసాగించాల్సి వుంది. అయితే తెలుగులో ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదల లేకపోవడం ఈ చిత్రానికి అడ్వాంటేజ్ కానుంది.
ఇక ఈచిత్రం తమిళ నాడులో 5రోజుల్లో 66కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఏపీ &తెలంగాణలోఈచిత్రం యొక్క ఐదు రోజుల కలక్షన్ల వివరాలు :
ఏరియా | కలక్షన్స్ |
నైజాం | 15.08 కోట్లు |
సీడెడ్ | 5.68 కోట్లు |
నెల్లూరు | 1.45 కోట్లు |
గుంటూరు | 2.76కోట్లు |
కృష్ణా | 2.17కోట్లు |
పశ్చిమ గోదావరి | 1.85కోట్లు |
తూర్పు గోదావరి | 2.69 కోట్లు |
ఉత్తరాంధ్ర | 4.67 కోట్లు |
ఏపీ, తెలంగాణ లో ఐదు రోజుల షేర్ | 36.35 కోట్లు |