త్వరలో డైరెక్ట్ డిజిటల్ గా అభినవ్ గోమతం “మై డియర్ దొంగ”

త్వరలో డైరెక్ట్ డిజిటల్ గా అభినవ్ గోమతం “మై డియర్ దొంగ”

Published on Jan 11, 2024 8:05 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ అభినవ్ గోమతం నటించిన మై డియర్ దొంగ త్వరలో ఆహా వీడియో లో డైరెక్ట్ డిజిటల్ గా విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో అభినవ్ గోమతం సరసన షాలిని కొండేపూడి నటించింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే, ఈ చిత్రానికి షాలిని కొండేపూడి ర‌చ‌యిత కూడా.

ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు మేకర్స్. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. బి.ఎస్. సర్వజ్ఞ కుమార్ మై డియర్ దొంగ చిత్రానికి దర్శకత్వం వహించగా, మహేశ్వర్ రెడ్డి గోజాల నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ మరియు క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ లు సంయుక్తంగా నిర్మించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు