కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ద్విభాషా ప్రాజెక్ట్ సార్/ వాతి తో తెలుగు చిత్ర పరిశ్రమలో తన అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు హైదరాబాద్లోని ప్రముఖ ఏఎంబీ సినిమాస్లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో, బహుముఖ నటుడు మాష్టారు మాష్టారు పాటను తమిళ వెర్షన్ లో పాడటం మొదలు పెట్టి, తెలుగు వెర్షన్ లో ముగించారు.
చిత్ర కథానాయిక సంయుక్తా మీనన్ ఈ పాట పాడమని ధనుష్ని కోరింది. నటుడు తమిళ వెర్షన్తో ప్రారంభించాడు, ఆపై అకస్మాత్తుగా, అతను తెలుగు వెర్షన్ను పాడటం తో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.