రెండు దశాబ్దాల తరువాత రమ్యకృష్ణతో కృష్ణ వంశీ !

రెండు దశాబ్దాల తరువాత రమ్యకృష్ణతో కృష్ణ వంశీ !

Published on Oct 15, 2019 8:29 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరు ఉన్న డైరెక్టర్ ల్లో ‘కృష్ణ వంశీ’ పేరు ముందు వరసలో ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ వినూత్న దర్శకుడు, ఇప్పుడు నటసామ్రాట్ అనే మరో వినూత్న సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఇది మరాఠీ రీమేక్ సినిమా. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని కృష్ణవంశీ తెలుగులో తెరకెక్కించబోతున్నాడు.

కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. ఏమైనా కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రేమ కథా చిత్రాలు తియ్యడంలో కృష్ణ వంశీ’ శైలే వేరు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు