ఏడేళ్ల తర్వాత టాలీవుడ్లో సిద్దార్థ్ సాలిడ్ కంబ్యాక్.!

ఏడేళ్ల తర్వాత టాలీవుడ్లో సిద్దార్థ్ సాలిడ్ కంబ్యాక్.!

Published on Sep 18, 2020 10:02 AM IST

ఒకప్పుడు లవ్ స్టోరీ సినిమాలు అంటే మన టాలీవుడ్ లో ముందు వరుసలో ఉండే పేరు సిద్దార్థ్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకున్న సిద్దార్థ్ కాలంతో పాటుగా సినిమా ట్రెండ్ మారే సరికి మన టాలీవుడ్ లో కనుమరుగయ్యి కోలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ అక్కడ కూడా సరైన విజయం అందుకోడానికి చాలా సమయమే తీసుకున్నాడు. అలా అక్కడ తీసిన హార్రర్ థ్రిల్లర్ “గృహం” తో మన తెలుగులో కూడా మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు.

తర్వాత మళ్ళీ “వదలడు” సినిమాతో ఒకే అనిపించిన సిద్దార్థ్ ఇప్పుడు తెలుగులో ఒక డైరెక్ట్ చిత్రం చెయ్యడానికి ఒప్పుకున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత టాలీవుడ్ లో సిద్దార్థ్ టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి శర్వానంద్ తో తీస్తున్న “మహా సముద్రం” సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్టు ఖరారు అయ్యింది. దీనితో సిద్దార్థ్ కంబ్యాక్ మంచి హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రానికి “సరిలేరు నీకెవ్వరు” నిర్మాత అనీల్ సుంకర నిర్మాతగా వ్యవహరించనుండగా మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు