“సైంధవ్” తర్వాత మరో మాసివ్ ప్రాజెక్ట్ ‘ఈటీవీ’ ఖాతాలో.!

“సైంధవ్” తర్వాత మరో మాసివ్ ప్రాజెక్ట్ ‘ఈటీవీ’ ఖాతాలో.!

Published on Dec 29, 2023 2:05 PM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర ఒక చెరగని ముద్ర వేసుకున్న పలు ప్రముఖ టెలివిజన్ ఛానెల్స్ లో ఈటీవీ కూడా ఒకటి. అయితే ఇందులో ఏదైనా లోటు ఉంది అంటే అది కొత్త సినిమాలు అలాగే పెద్ద సినిమాలు అనేవి చాలా తక్కువ టెలికాస్ట్ అవుతాయి. అయితే దీనిని ఇప్పుడు ఓవర్ కం చేస్తుండడం ఈటీవీ అభిమానులకి ఆనందం కలిగిస్తుంది.

రీసెంట్ గానే మన టాలీవుడ్ సీనియర్ స్టార్ వెంకీ మామ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “సైంధవ్” శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోగా చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఇక ఇదిలా ఉండగా దీనితో పాటుగా మరో సరికొత్త ప్రాజెక్ట్ అది కూడా “సైంధవ్” లానే పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసిన చిత్రం హక్కులు కూడా ఈటీవీ ఖాతాలో వేసుకున్నారు.

మరి ఆ చిత్రమే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “డెవిల్”. ఈ చిత్రం తాలూకా శాటిలైట్ హక్కులు కూడా ఈటీవీ సొంతం చేసుకోవడం విశేషం. దీనితో ఈ రెండు చిత్రాలు కూడా రానున్న రోజుల్లో ఈటీవీ లోనే వీక్షించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు