ఈ సారైనా హీరోయిన్ని పట్టుకుంటారా ?

ఈ సారైనా హీరోయిన్ని పట్టుకుంటారా ?

Published on Jul 4, 2019 9:25 PM IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న సినిమా గత నెల 26 నుంచి మొదలు అవ్వాలి. చిత్రబృందం కూడా అదే రోజున మొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుందని అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఈ నెల 15 నుండి ప్లాన్ చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం హీరోయిన్ ను ఫైనల్ చేసే ప్రొసెస్ లో ఉంది. ఈ సారైనా హీరోయిన్ని పట్టుకుంటారా ? లేక మళ్లీ డేట్ మార్చుకుంటారో చూడాలి.

ఆ మధ్య కియరా అద్వానీ లేదా రష్మికా మండన్నలో ఎవరో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే అఖిల్ సరసన దాదాపు కొత్త హీరోయిన్ నే ఫైనల్ చెయ్యబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి ఇంతకీ కొత్త హీరోయిన్ ను తీసుకుంటారా లేక రష్మికా మండన్నకే ఫిక్స్ అవుతారా అనేది చూడాలి. ఇక అఖిల్ కి ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఈ సినిమా కూడా భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు