కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందుతున్న ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో అమితాబ్, రణ్బీర్ కపూర్ లతో కలిసి అక్కినేని నాగార్జున కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్బీర్కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం..ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమా మొదటి పార్ట్ ను వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం లో నాగార్జున చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.
దర్శకుడు అయాన్ ముఖర్జీ, నాగార్జునకు బ్రహ్మస్త్ర కథ చెప్పి, ఓ పాత్ర చేయమని అడిగిన వెంటనే.. నాగార్జున ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించారట. ఇప్పటికే నాగార్జున జక్మ్, ఖుదా గవా వంటి కొన్ని హిందీ సినిమాల్లో నటించారు.