వైరల్ పిక్ : తండ్రి అల్లు అర్జున్ తో కలిసి డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న అర్హ

వైరల్ పిక్ : తండ్రి అల్లు అర్జున్ తో కలిసి డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న అర్హ

Published on Nov 2, 2022 2:03 AM IST


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతి త్వరలో పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తన షూటింగ్స్ కి విరామం దొరికిన సమయంలో ఎక్కువగా ఫ్యామిలీ తో గడిపేందుకు ఇష్టపడుతుంటారు అల్లు అర్జున్.

ఇక ఇటీవల ఫ్యామిలి తో కలిసి వెకేషన్ వెళ్లి వచ్చిన అల్లు అర్జున్, ప్రస్తుతం వారితో కలిసి హ్యాపీగా మంచి క్వాలిటీ టైం గడుపుతున్నారు. కాగా అల్లు అర్జున్ తో పాటు ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. తరచు తమ ఫామిలీ సంగతులని ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకునే అల్లు స్నేహారెడ్డి, నేడు భర్త అల్లు అర్జున్ తో కలిసి కూతురు అర్హ హ్యాపీగా కారులో కూర్చుని డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. కాగా ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు