‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ట్రైలర్.. 4 మిలియన్ వ్యూస్ !

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ట్రైలర్.. 4 మిలియన్ వ్యూస్ !

Published on Nov 12, 2018 11:49 AM IST

రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. కాగా నిన్న విడుదల అయిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే నాలుగు మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఇక ట్రైలర్ ప్రధానంగా ‘ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వాళ్లు కొందరైతే.. శక్తి మేరకు నయవంచన చేసే వాళ్లు కోకొల్లలు’ అంటూ సాగే వాయిస్ ఓవర్‌ తో మొదలవుతుంది. ట్రైలర్ చూస్తుంటే.. శ్రీను వైట్ల తన దర్శకత్వ శైలికి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది.

కాగా ట్రైలర్ లో మెయిన్ గా ‘దిస్ ఈజ్ నాట్ ఎ రివెంజ్, ఇట్స్ ఎ రిటర్న్ గిఫ్ట్. ఐయామ్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్, వియ్ ఆర్ స్ట్రాంగ్..’ అని రవితేజ చెప్పే డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ ను బాగా ఎలివేట్ చేసింది.

ఇక ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు