ఓటిటిలో సెన్సేషనల్ రెస్పాన్స్ తో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”

ఓటిటిలో సెన్సేషనల్ రెస్పాన్స్ తో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”

Published on Mar 6, 2024 3:00 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా యంగ్ నటి శివాని నాగారం టాలీవుడ్ కి పరిచయం అవుతూ వచ్చిన లేటెస్ట్ చిత్రం “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. దర్శకుడు దుశ్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో మంచి హిట్ కాగా రీసెంట్ గానే మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో స్ట్రీమింగ్ కి కూడా వచ్చింది.

మరి ఈ చిత్రం ఓటిటిలో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని నమోదు చేస్తుంది. ఆహా లో ఈ సినిమా లేటెస్ట్ గా ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ లో క్రాస్ చేసినట్టుగా తాము తెలిపారు. దీనితో ఈ సినిమా ఓటిటిలో కూడా అదరగొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో యువ నటి శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు