టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “యానిమల్”

టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “యానిమల్”

Published on Mar 12, 2024 11:03 AM IST


టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ యానిమల్ మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమా థియేటర్లలో మరియు OTT ప్లాట్‌ఫారమ్‌లలో అలరించిన ఈ పాన్ ఇండియన్ ఫిల్మ్, ఇప్పుడు మార్చి 17, 2024న సాయంత్రం 7 గంటలకు సోనీ మాక్స్ ఛానెల్‌లో టెలివిజన్ ప్రీమియర్ (హిందీ వెర్షన్) కోసం సిద్ధమవుతోంది.

మరి బుల్లితెర ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. యానిమల్‌లో బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ, అనిల్ కపూర్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. టి సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ జాయింట్ వెంచర్‌గా నిర్మించబడిన ఈ చిత్రంకి హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు