రాజశేఖర్‌ కి మరో కథ చెప్పబోతున్నాడట !

రాజశేఖర్‌ కి మరో కథ చెప్పబోతున్నాడట !

Published on Jul 5, 2019 7:05 PM IST

యాంగ్రిస్టార్‌ డా. రాజశేఖర్‌ లాంటి హీరోకి ‘కల్కి’ కథ చెప్పి సింగిల్‌ నేరేషన్‌లోనే ఆయన్ని మెప్పించి కథను ఒప్పించిన రైటర్‌ సాయి తేజ్ దేశరాజ్. ఆయన కథ అందించిన ‘కల్కి’ జూన్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పర్వాలేదనిపించుకుంది. కాగా ఈ సందర్భంగా ‘కల్కి’ చిత్ర కథ రచయిత సాయి తేజ దేశరాజు మీడియాతో మాట్లాడారు. సాయి తేజ దేశరాజు మాట్లాడుతూ.. ‘మాది మహబూబ్‌ నగర్‌ జిల్ల్లా. నాకు చిన్నప్పటి నుండి రైటింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌. అయితే నేను ఆన్‌ లైన్‌ లో ఓ వెబ్‌ సైట్‌ లో ఈ ‘కల్కి’ కథను 46 ఎపిసోడ్స్‌ గా రాశాను. అది చదివిన ఓ వ్యక్తి నాకు ప్రశాంత్‌ వర్మను పరిచయం అయ్యారు.
ప్రశాంత్‌ వర్మ ఏదైనా మంచి కథ ఉందా రాజశేఖర్‌గారికి అం అడిగితే.. ఈ ‘కల్కి’ కథ గురించి చెప్పాను. రాజశేఖర్‌ గారికి బాగా నచ్చింది. వెంటనే సినిమా సెట్స్‌ మీదకి వెళ్ళింది.

‘కల్కి’ సక్సెస్‌ తరువాత చాలా కాన్ఫిడెన్స్‌ వచ్చింది. అలాగే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్‌ కూడా కాంటాక్ట్‌ అయ్యారు. వారికి కూడా కథ చెప్పాను. వారి నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ వీక్‌ లో నేను రాజశేఖర్‌ గారికి మరో కథ చెప్పబోతున్నాను. అది మంచి ఎమోషన్‌తో కూడిన కాప్‌ థ్రిల్లర్‌. ఆయనకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇటీవల ‘కార్తికేయ’ సినిమా నిర్మాత వెంకట శ్రీనివాస్‌ గారికి ఒక సీరియల్‌ కిల్లర్‌ కి సంబంధించిన స్టోరీ చెప్పడం జరిగింది. అయన ప్రొడ్యూస్‌ చేయడానికి ముందుకు వచ్చారు. టైటిల్‌ ‘కిన్నెరసాని’. తరువాత ఒక భారీ స్టార్‌కి స్టోరీ లైన్‌ చెప్పాను. చాలా బాగుంది. ఫుల్‌ స్టోరీ నేరేట్‌ చేయమని చెప్పారు. ఇంకో రెండు రోజుల్లో ఆ స్టోరీ చెప్తాను. అంటూ చెప్పుకొచ్చారు రైటర్‌ సాయి తేజ దేశరాజు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు