అనుపమ పరమేశ్వరన్ ప్లాన్ మామూలుగా లేదుగా

అనుపమ పరమేశ్వరన్ ప్లాన్ మామూలుగా లేదుగా

Published on Jul 1, 2019 10:18 PM IST

మలయాళ ‘ప్రేమమ్’ చిత్రంతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్ ఆ తరవాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ‘అ.. ఆ, ప్రేమమ్, శతమానం భవతి’ లాంటి సినిమాలు చేసి నిలదొక్కుకునే పయత్నం చేసింది. కానీ ‘తేజ్ ఐలవ్ యు, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం’ లాంటి ఫ్లాప్స్ పడటంతో ముందు జాగ్రత్తగా ఇతర పరిశ్రమ మీద కూడా దృష్టి పెట్టింది.

ముందుగా కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సరసన ‘నటసార్వభౌమ’ చిత్రం చేసి సక్సెస్ అందుకుంది. అలాగే తమిళంలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఎప్పుడో 2016లో మొదటిసారి తమిళ చిత్రం చేసిన ఆమె మళ్ళీ ఈ 2019లో కొత్త చిత్రానికి సైన్ చేసింది. ఇందులో అథర్వ మురళి హీరో కాగా కన్నన్ దర్శకుడు. ఈ జూలై 15 నుండే రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. అలాగే తెలుగులో ఆమె చేసిన కొత్త చిత్రం ‘రాక్షసుడు’ విడుదలకు రెడీ అవుతోంది. ఇలా మొత్తం నాలుగు దక్షిణాది భాషల మీదా దృష్టి పెట్టింది ఈ కేరళ కుట్టి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు