ఆస్కార్ జ్యూరీ సభ్యుడిగా ‘బాహుబలి’ టీమ్ మెంబర్

ఆస్కార్ జ్యూరీ సభ్యుడిగా ‘బాహుబలి’ టీమ్ మెంబర్

Published on Jul 2, 2019 9:16 PM IST

హాలీవుడ్ సినీ పరిశ్రమ నిర్వహించే ఆస్కార్ అవార్డుల వేడుకకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ పురస్కారాలనే అత్యుత్తమమైనవిగా పరిగణిస్తుంటారు ప్రపంచంలోని సినిమా వ్యక్తులు. అలాంటి అకాడమీ అవార్డుల జ్యూరీ సభ్యుల జాబితాలో ఇండియా తరపున విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరీలో శ్రీనివాస్ మోహన్ ఎంపికయ్యారు. ఇది నిజంగా దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగిన విషయమే.

ఎందుకంటే శ్రీనివాస్ మోహన్ దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే కాబట్టి. ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాలు ‘రోబో, 2 పాయింట్ 0, బాహుబలి’ చిత్రాలకు విఎఫ్ఎక్స్ చేసింది ఈయనే. ఆయన పనితనం ప్రపంచస్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించింది. అందుకే ఆయన్ను ఇండియా తరపున విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరీలో జ్యూరీ సభ్యుడిగా ఎంపిక చేశారు అకాడమీ అవార్డుల నిర్వాహకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు