పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా విడుదలైన ‘అడవి తల్లి’ అనే పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ని షేక్ చేస్తుంది. ఈ పాటను ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి కలిసి ఆలపించారు
మంచిర్యాల జిల్లాకు చెందిన కుమ్మరి దుర్గవ్వ ఈ పాటను పాడింది. ఆమె చదువుకోలేదు. కేవలం తెలుగులోనే కాకుండా మరాఠీలోనూ ఆమె అనేక పాటలు పాడారు. ఈమె పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే, సిరిసిల్లా చిన్నది వంటి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి