స్ట్రీమింగ్ కి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ “భూతద్దం భాస్కర్ నారాయణ”

స్ట్రీమింగ్ కి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ “భూతద్దం భాస్కర్ నారాయణ”

Published on Mar 22, 2024 10:00 AM IST

రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన పలు థ్రిల్లర్ జానర్ చిత్రాల్లో శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా దర్శకుడు పురుషోత్తం రాజు తెరకెక్కించిన ఓ క్రేజీ స్పై అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “భూతద్దం భాస్కర్ నారాయణ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం థియేటర్స్ లో డీసెంట్ రెస్పాన్స్ నే అందుకోగా అప్పుడు మిస్ అయ్యిన వారు అయితే ఓటిటి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసారు.

మరి ఈ చిత్రాన్ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా ఈ మార్చ్ 22 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా గత వారమే కన్ఫర్మ్ చేశారు. ఇక ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నేటి నుంచి ఆహా లో ఈ సినిమా అందుబాటులో ఉండగా మరి గతంలో మిస్ అయ్యినవారు అయితే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి బుల్గానిన్ అలాగే శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా స్నేహాల్ జంగాల, శశిధర్ కాశీ అలాగే కార్తీక్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు