‘బిగ్ బాస్ తెలుగు – 5’ పై రోజురోజుకు ఆసక్తి పెరుగుతుంది. తాజాగా మరోసారి ఈ క్రేజీ షోలో మరో ఆసక్తికర పోరు మొదలు కానుంది. ఇప్పటికే శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే గెలుచుకుని టాప్-5లో ఒకడిగా స్థానాన్ని సంపాదించాడు. ఇక హౌస్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు ఏ నంబర్లో ఉండాలి అనే విషయంలో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు.
‘అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఒకటి నుంచి ఆరు వరకు మీ స్థానాలను నిర్ణయించుకుని అందుకు సంబంధించిన ర్యాంకుల వెనకాల నిలబడండి’ అని బిగ్బాస్ ఆదేశించాడు. అయితే, సన్నీ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఫైట్ ఒకటో నంబర్ గురించే.. నేను వెళ్లి ఫస్ట్ లో ఉంటాను’ అంటూ సన్నీ చెప్పిన విధానం నవ్వులు పూయిస్తోంది. పైగా ఫస్ట్ నంబరు బోర్డును తన దగ్గర ఉంచుకుంటానంటూ హడావుడి చేశాడు.
అయితే, ఆ తర్వాత కాజల్ ఒకటో నంబర్ బోర్డు వద్దకు వస్తే.. ‘అతిగా ఆశ పడే ఆడది.. అతిగా ఆవేశ పడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అంటూ సన్నీ కామెడీగా విసిరిన పంచ్ డైలాగ్ కూడా బాగా పేలింది. ఇక చివరిగా షణ్ముఖ్ మాట్లడుతూ.. ‘నేను అలా ఆడను. నిజమైన వ్యక్తి పేరు చెబుతా’ అని షణ్ముఖ్ అంటే, ‘పర్ఫెక్ట్ అయితే ఫస్ట్ వచ్చి ఆడు’ అంటూ సన్నీ ఛాలెంజ్ చేశాడు. మొత్తమ్మీద ఎవరు? ఏయే స్థానాల్లో నిలబడతారా? అన్న ఆసక్తి పెరిగింది.