మరోసారి బ్లాక్ బస్టర్ ‘భీష్మ’ కాంబో రిపీట్ కానుందా ?

మరోసారి బ్లాక్ బస్టర్ ‘భీష్మ’ కాంబో రిపీట్ కానుందా ?

Published on Nov 6, 2022 9:30 AM IST

నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో 2020లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ భీష్మ. ఈ యాక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు. రిలీజ్ తరువాత అందరి ఆన్చానుల్ అందుకుని భీష్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో నితిన్ సూపర్బ్ యాక్టింగ్, రష్మిక మందన్న అందచందాలు, మహతి స్వర సాగార్ సూపర్ ట్యూన్స్, డైరెక్టర్ వెంకీ కుడుముల ఆకట్టుకునే కథ, కథనాలు, కెమెరా మ్యాన్ సాయి శ్రీరామ్ గ్రాండియర్ విజువల్స్, గిలిగింతలు పెట్టె కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఆకట్టుకునే డైలాగ్స్, యాక్షన్, ఫైట్స్ వంటివి భీష్మ మూవీని సూపర్ హిట్ చేసాయి.

అయితే విషయం ఏమిటంటే, అతి త్వరలో ఇదే కాంబినేషన్ మరొక్కసారి రిపీట్ కానుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ఒక మూవీ చేసేందుకు కమిట్ అయిన వెంకీ కుడుముల, ఈలోపు నితిన్ మూవీని వేగవంతంగా తెరకెక్కించేందుకు ప్లాన్స్ చేస్తున్నారట. అలానే ఈ ప్రతిష్టాత్మక మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ క్రేజీ కాంబో మూవీ గురించిన పూర్తి వివరాలు అతిత్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు