హాస్యనటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ పదిలమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న బ్రహ్మానందం తాజాగా ‘పంచతంత్రం’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా నేడు మా కథకుడు రెడీ అంటూ ఫస్ట్ లుక్ని చిత్ర బృందం విడుదల చేసింది.
ఇందులో బ్రహ్మానందం వేదవ్యాస్ పాత్రలో కనిపించబోతున్నారు. మైక్ ముందు నిలుచుని ఏదో ఉపన్యాసం ఇస్తున్నట్టు ఉన్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, నవంబర్లో ఈ సినిమాను విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సముద్రఖని, స్వాతి రెడ్డి, యువ హీరో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.