నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా సి.క‌ల్యాణ్ !

నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా సి.క‌ల్యాణ్ !

Published on Jul 1, 2019 8:31 AM IST

ఆదివారం నాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నిక‌లు జ‌రిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నిక‌ల్లో నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా ప్రముఖ నిర్మాత సి.క‌ల్యాణ్ విజ‌యం సాధించారు. మండ‌లి ఎన్నిక‌ల్లో 477 ఓట్లు పోల‌వ‌గా.. అందులో నాలుగు ఓట్ల‌ను చెల్ల‌ద‌ని నిర్ణ‌యించారు. కాగా మిగిలిన ఓట్ల‌లో 378 ఓట్లు సి.క‌ల్యాణ్ సాధించారు. ఆర్‌.కె.గౌడ్ 95 ఓట్ల‌ను సాధించారు. ఆదివారం జ‌రిగిన ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఎన్నిక‌ల్లో మ‌న కౌన్సిల్‌-మ‌న ప్యానెల్‌ ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

ఈ ఎన్నిక‌ల్లో సి.క‌ల్యాణ్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. వైస్ ప్రెసిడెంట్స్‌గా కె.అశోక్‌కుమార్‌, వై.వి.ఎస్‌.చౌద‌రి, సెక్ర‌ట‌రీగా టి.ప్ర‌స‌న్న‌కుమార్‌, మోహన్ వడ్లపట్ల జాయింట్ సెక్రటరీగా, ట్రెజ‌ర‌ర్‌ గా చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఎన్నిక‌య్యారు. అలాగే ఈసీ మెంబ‌ర్స్‌గా కె.అమ్మిరాజు, అశోక్‌ కుమార్ వ‌ల్ల‌భ‌నేని, బండ్ల‌ గ‌ణేశ్‌, ఆచంట గోపీనాథ్, ప‌ల్లి కేశ‌వ‌రావు, శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, జి.వి.న‌ర‌సింహారావు, ఎస్‌.కె.న‌యీమ్ అహ్మ‌ద్‌, ప‌రుచూరి ప్ర‌సాద్‌, టి.రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, వి.సాగ‌ర్‌, వ‌జ్జా శ్రీనివాస‌రావు, పి.సునీల్‌కుమార్ రెడ్డి, కామిని వెంక‌టేశ్వ‌ర‌రావు, వి.వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్నిక‌య్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు