తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలైన సినీ ప్రముఖులు !

తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలైన సినీ ప్రముఖులు !

Published on Dec 11, 2018 5:41 PM IST

తెలంగాణ లో జరిగిన ముందస్తు శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కారు జోరుకు కూటమి సహా ఇతర పార్టీలు కుదేలయ్యాయి . 119 స్థానాలకు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 83 స్థానాలో విజయం సాధించి రెండో సారి అధికారాన్ని కైవసం చేసుకుంది.

ఇక ఈ ఎన్నికల్లో సినీ ఇండీస్ట్రీ నుండి పలువురు ప్రముఖలు పోటీ చేసి ఓటిమి పాలయ్యారు. ప్రముఖ నిర్మాత భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ టీడీపీ పార్టీ తరుపున శేరిలింగంపల్లి నియోజిక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే బాబు మోహన్ అందోల్ నుండి , నటి రేష్మ రాథోడ్ వైరా నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరితో పాటు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ల సోదరి నందమూరి సుహాసిని కూకట్ పల్లి నుండి పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు