దాసరికి పద్మ పురస్కారం ఇవ్వాలంటున్న చిరు

దాసరికి పద్మ పురస్కారం ఇవ్వాలంటున్న చిరు

Published on May 4, 2021 5:11 PM IST

స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావుగారి విశిష్టత గురించి ఆదరికీ తెలుసు. ఆయన చేసిన సినిమాలు, అందుకున్న విజయాలు, చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ స్మరణీయమే. సుమారు 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన. ఈరోజు ఆ మహనీయుడి 74వ జయంతి. ఈ సందర్బంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను స్మరించుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి దాసరిగారిని గుర్తుచేసుకున్నారు.

విజయాలలో ఒకదాన్ని మించి మరో చిత్రాన్ని అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు.. నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమేనన్న చిరు అలాంటి గొప్ప వ్యక్తికి ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు రాకపోవడం ఒక తీరని లోటని, ఇప్పటికైనా ఆయనకు విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరమవుతుందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు