సుమన్ రంగనాథన్, ముమైత్ ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్కుమార్, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ… సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు.
దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ.. ‘దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్, ముమైత్ ఖాన్, సంజీవ్ కుమార్, సుమన్ రంగనాథన్ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు.