డార్క్ కామెడీ సినిమాకి సెన్సార్ అయింది !

డార్క్ కామెడీ సినిమాకి సెన్సార్ అయింది !

Published on Feb 18, 2019 9:13 PM IST

ప్రముఖ కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. నూతన దర్శకుడు ప్రశాంత్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

తాజాగా ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సిద్ధమైంది. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు