ఈ కాంబినేషన్ మళ్ళీ సక్సెస్ అవుతుందా ?

ఈ కాంబినేషన్ మళ్ళీ సక్సెస్ అవుతుందా ?

Published on Jul 5, 2019 6:05 PM IST

‘గీత గోవిందం’తో సెన్సేషనల్ హిట్టు కొట్టి స్టార్ డైరక్టర్స్ జాబితాలో చేరిపోయాడు పరుశురాం. ఈ చిత్రం తరువాత ఇంతవరకు తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.
దాంతో పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. కాగా పరుశురామ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన తరువాత సినిమాని ప్లాన్ చేస్తునట్లు గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి.

అయితే పరుశు రామ్ మాత్రం తన తరువాత సినిమాని కూడా విజయ్ దేవరకొండతోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరుశురామ్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసాడట. కాగా సినిమా మొత్తం పక్కా పల్లెటూరి నేపథ్యంలో ఉంటుందట. సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎనభై నాటి కాలంలో జరుగుతుందని.. ఆ ప్లాష్ బ్యాక్ సన్నివేశాలన్నీ ఎమోషనల్ గా సాగుతాయని తెలుస్తోంది. మరి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మళ్ళీ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు