సంక్రాంతికే వచ్చేస్తోన్న ‘ఎక్స్‌ప్రెస్ రాజా’!

సంక్రాంతికే వచ్చేస్తోన్న ‘ఎక్స్‌ప్రెస్ రాజా’!

Published on Dec 28, 2015 9:51 PM IST

Express-Raja
తెలుగులో విలక్షణ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్, తాజాగా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ పేరుతో ఓ రోడ్ జర్నీ సినిమాతో మనముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వరుస హిట్స్‌తో దూసుకుపోతోన్న యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఇక ఈ మధ్యే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో ఎక్స్‌ప్రెస్ రాజా టీమ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రమోషన్స్ చేపడుతోంది.

గత కొద్దిరోజుల క్రితమే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమా సంక్రాంతి సీజన్‌కే ఫిక్స్ అయిందని దర్శక, నిర్మాతలు తెలపగా, తాజాగా రిలీజ్ డేట్‌ను కూడా కన్‌ఫర్మ్ చేసేశారు. జనవరి 14న సరిగ్గా సంక్రాంతి రోజునే ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. సంక్రాంతి సీజన్‌లో ఇప్పటికే నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ, వీటన్నింటికీ పూర్తి భిన్నమైన జానర్‌లో రూపొందిన సినిమా కావడంతో యూవీ క్రియేషన్స్ ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాను సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు తెలిపింది. శర్వానంద్ సరసన సురభి హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు