‘ఫలక్ నుమా దాస్’ నైజాం కలెక్షన్స్ !

‘ఫలక్ నుమా దాస్’ నైజాం కలెక్షన్స్ !

Published on Jun 4, 2019 10:42 AM IST

విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా – హీరోగా, కరాటీ రాజు నిర్మాణంలో వచ్చిన చిత్రం ‘ఫలక్ నుమా దాస్’. హర్షిత గౌర్, సలోని మిశ్రా హీరోయిన్స్ గా నటించగా, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. కాగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో గత శుక్రవారం విడుదల అయిన ఈ చిత్రం.. నైజాంలో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది.

‘ఫలక్ నుమా దాస్’ మొదటి రోజు నైజాంలో ప్రీమియర్ షోలను కూడా కలుపుకుని మొత్తం 75 లక్షల షేర్ ను రాబట్టింది. అదేవిధంగా రెండో రోజున 48 లక్షల షేర్ ను, మూడో రోజున 44 లక్షల షేర్ ను, నాలుగో రోజున 22 లక్షల షేర్ ను సాధించింది. కాగా నైజాంలో మొత్తం నాలుగు రోజులుకుగానూ ‘ఫలక్ నుమా దాస్’ 1.89 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇంకా నైజాంలో ఈ చిత్రానికి ఆదరణ బాగుంది. పక్కా హైదరాబాద్ నేపథ్యంలో తెరెకెక్కిన ‘ఫలక్ నుమా దాస్’ నైజాం జనాన్ని బాగా ఆకట్టుకుంటుంది. నైజాంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మూడు కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు