అజిత్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న గౌతమ్ మీనన్ !

అజిత్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న గౌతమ్ మీనన్ !

Published on Feb 8, 2018 8:58 AM IST

తమిళ స్టార్ హీరో అజిత్, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్లు మరోసారి కలిసి పనిచేయనున్నారనే వార్త కోలీవుడ్లో తెగ సందడి చేస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఎన్నై అరిందాల్’ అనే సినిమా చేశారు. 2015లో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ‘ఎంతవాడు గాని’ పేరుతో ఈ చిత్రం విడుదలైంది.

గౌతమ్ మీనన్ మళ్ళీ ఇప్పుడు ఈ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మరి ఈ వార్తలు ఫలించి వీరిద్దరి క్రేజీ కాంబో మరోసారి కుదురుతుందేమో చూడాలి. ఇకపోతే అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో చేయనున్న ‘విశ్వాసం’కు సిద్ధమవుతుండగా గౌతమ్ మీనన్ ధనుష్ తో ఒక సినిమా, విక్రమ్ తో ‘ధృవ నచ్చత్తిరమ్’ అనే మరో సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు