అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఐతే, చిత్రబృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. శనివారమే జరగాల్సిన ఈ ఈవెంట్ అనివార్య కారణాలతో ఆదివారం జరిగింది. కాగా ఈ సినిమా జాతర ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తాడని మొదట టీమ్ అధికారికంగా తెలిపింది. దీంతో, బన్నీ అభిమానులు కూడా తండేల్ ఈవెంట్ పై బాగా ఇంట్రెస్ట్ చూపించారు.
కానీ, చివరి నిమిషంలో తండేల్ జాతర ఈవెంట్ కి బన్నీ రాలేకపోయాడు. దీనికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అరవింద్ మాట్లాడుతూ.. ‘తండేల్ జాతర ఈవెంట్కి బన్నీ గెస్టుగా రావాల్సి ఉంది. కానీ, తను ఫారెన్ నుంచి వచ్చాడు. తనకు చాలా సివియర్గా గ్యాస్ట్రిటిస్ (గ్యాస్ పెయిన్) వచ్చింది. అందుకే ఈ ఈవెంట్ కి బన్నీ రాలేకపోయాడు. మీ అందరికీ ఈ విషయం చెప్పమన్నాడు. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి’ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. ఇక తండేల్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.