సమంత,నందిని రెడ్డి మూవీకి హై కోర్ట్ షాక్…!

సమంత,నందిని రెడ్డి మూవీకి హై కోర్ట్ షాక్…!

Published on Jul 27, 2019 7:48 AM IST

సమంత అక్కినేని, సిద్దార్థ్ హీరోయిన్ హీరోయిన్స్ గా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో 2013లో వచ్చిన “జబర్దస్త్” మూవీ ప్రదర్శన ఆపివేయాలని హై కోర్ట్ ఆదేశించడం జరిగింది. ఈ మూవీకి సంబందించిన సీడీలు, బ్లూ రే ప్రింట్ల ప్రదర్శనతో పాటు, ఏవిధమైన ప్రదర్శన చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ పిటిషన్ మేరకు కోర్ట్ ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది.

రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ జోడీగా 2010లో విడుదలైన “బ్యాండ్ బాజా బరాత్” చిత్రం ఘనవిజయం సాధించి. ఈ మూవీని తెలుగులో “జబర్దస్త్” గా అనధికారికంగా కాపీ చేసారని యష్ రాజ్ ఫిలిమ్స్ అప్పట్లో పిటిషన్ దాఖలు చేయగా, కోర్ట్ వారికి అనుకూలంగా తెలుగు చిత్రం “జబర్దస్త్”ని ఏవిధంగా ప్రదర్శించరాదని తీర్పు వెలువరించి.

అప్పట్లో “జబర్దస్త్” మూవీ పరాజయాన్ని చవిచూసింది.ఐతే మళ్ళీ ఆరేళ్ళ తరువాత కలిసి పనిచేసిన సమంత, నందినిరెడ్డి “ఓ బేబీ” చిత్రం తో సూపర్ హిట్ అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు