SSMB29 మూవీ పై ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ నిజమేనా …??

SSMB29 మూవీ పై ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ నిజమేనా …??

Published on Jul 3, 2022 3:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ తో త్వరలో దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఒక భారీ పాన్ ఇండియా సినిమా తీయనున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ అధినేత కె ఎల్ నారాయణ ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ క్రేజీ మూవీ పై అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఎప్పుడో రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉందని, అయితే మధ్యలో తామిద్దరికీ వరుసగా కమిట్మెంట్స్ ఉండడంతో అది ఇన్నేళ్ళపాటు వాయిదా పడుతూ వచ్చి ఇప్పటికి సెట్ అయిందని ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ తెలియచేసారు.

అయితే ఈ మూవీ భారీ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా మూవీగా తెరకెక్కే ఛాన్స్ ఉందని, అటువంటి స్టోరీ కోసం ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ ప్రతిష్టాత్మక మూవీని కేఎల్ నారాయణ తోపాటు బాహుబలి మూవీస్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన శోభు యార్లగడ్డ కూడా కలిసి నిర్మించనున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల కమల్ కన్నన్, శోభు యార్లగడ్డ లతో కలిసి రాజమౌళి ఫ్రాన్స్ లోని యూనిట్ ఇమేజ్ 3డి ఎఫెక్ట్స్ స్టూడియోని సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ న్యూస్ పై మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు