వైరల్ : ఊర్వశి పోస్ట్ రిషబ్ కోసమేనా.?

వైరల్ : ఊర్వశి పోస్ట్ రిషబ్ కోసమేనా.?

Published on Dec 30, 2022 10:06 PM IST

ఈరోజు సోషల్ మీడియాలో ఉదయాన్నే రెండు షాకింగ్ న్యూస్ లు అయితే బయటకి వచ్చాయి. ఒకటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి కన్నుమూశారని తెలియగా దేశ వ్యాప్తంగా ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాగా మరొకటి ఫార్మర్ క్రికెటర్ ఇండియా జట్టులో ప్రస్తుతం కీలకంగా ఆడుతున్నటువంటి యువ ఆటగాడు రిషబ్ పంత్ దారుణమైన రోడ్డు ప్రమాదానికి గురి కావడం అని చెప్పాలి.

రిషబ్ ఈరోజు తెల్లవారున రోడ్డు ప్రమాదానికి గురి కాగా అనేకమంది క్రికెటర్ లు తమ తోటి ఆటగాడు త్వరగా కోలుకోవాలని థమన్ బాధ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో గత కొన్నాళ్ల నుంచి పంత్ విషయంలో రీసెంట్ బాస్ పార్టీ సెన్సేషన్ ఊర్వశి రౌటేలా మధ్య కొన్ని అంశాల్లో పెద్ద రచ్చే నడిచింది.

అయితే ఈ ఉదయం పంత్ వార్త తర్వాత ఆమె పెట్టిన ఇన్స్టా పోస్ట్ ఒకటి మాత్రం వైరల్ గా మారింది. తన పిక్ పెట్టి అయితే “ప్రేయింగ్” అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఇది రిషబ్ కోసమే అన్నట్టుగా అంతా అనుకుంటున్నారు. అయితే రిషబ్ మాత్రం తీవ్ర గాయాలు పాలయ్యాడు. తాను త్వరగా కోలుకోవాలని మా 123తెలుగు టీం కూడా కోరుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు