“ఇస్మార్ట్ శంకర్”ని దిగ్విజయంగా ముగించారు.

“ఇస్మార్ట్ శంకర్”ని దిగ్విజయంగా ముగించారు.

Published on Jul 5, 2019 3:30 PM IST

హీరో రామ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న “ఇస్మార్ట్ శంకర్” మూవీ కార్యక్రమాలన్ని దిగ్విజయంగా పూర్తయిన సందర్బంగా చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టిమరీ ముగింపు పలికారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో రామ్,డైరెక్టర్ పూరితోపాటు, హీరోయిన్ నభా నటేష్, నిర్మాత నటి ఛార్మి పాల్గొన్నారు.

ఈనెల 5న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్లో హీరో రామ్ ని పూరి జగన్నాథ్ ఉరమాస్ తెలంగాణా పోరగాడిగా ప్రెసెంట్ చేసిన తీరు సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. ఈనెల 18న ప్రపంచ వ్యాప్తంగా ఇస్మార్ట్ శంకర్ మూవీని భారీగా విడుదల చేయనున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి నిర్మిస్తున్న ఈచిత్రంలో నిధి అగర్వాల్,నాభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా,మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు