సెన్సార్ చేయించుకున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ !

సెన్సార్ చేయించుకున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ !

Published on Nov 13, 2018 12:14 AM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రం ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . గత కొంతకాలంగా శ్రీను వైట్ల, రవితేజ ఇద్దరూ వరుస పరాజయాలతో సతమతవుతున్నారు. దాంతో ఈ చిత్రం విజయం ఈ ఇద్దరికీ చాలా కీలకం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు