పరుగుల రాణి బయోపిక్ పై కత్రినా క్లారిటీగా ఉంది.

పరుగుల రాణి బయోపిక్ పై కత్రినా క్లారిటీగా ఉంది.

Published on Jun 8, 2019 4:00 PM IST

బాలీవుడ్ లో క్రీడా ప్రముఖులపై తీసిన బయో పిక్ లు అన్ని దాదాపు విజయం సాధించాయి. దంగల్, ధోని, సచిన్, మేరీకోమ్, మిల్కా సింగ్ ఇలా చెప్పుకుంటూ పొతే లిస్ట్ చాలా పెద్దదే ఉంది. తాజాగా స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా వస్తున్న ’83’ మూవీలో నటిస్తున్నారు. అయితే పరుగుల రాణి పి.టి. ఉష బయోపిక్‌ రాబోతోందని, ఇందులో కత్రినా కైఫ్‌ నటించబోతున్నట్లుప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని మీడియా తాజాగా కత్రినాను అడిగింది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను ప్రాజెక్టుపై సంతకం చేసే వరకూ దీని గురించి మాట్లాడాలి అనుకోవడం లేదు. ఆమె కథను నేను చేయగలను అనుకుంటే చేస్తాను’ అని అన్నారు.

అలాగే పరా ఖాన్ దర్శకత్వంలో కూడా ఓ మూవీలో నటిస్తున్నారట కదా అని అడిగిన ప్రశ్నకు .. ‘మీరు దీని గురించి దర్శకురాలు ఫరా ఖాన్‌ను అడగాలి. నిజంగా నాకు దీని అప్‌డేట్స్‌ తెలియవు’ అని చెప్పారు. సల్మాన్‌ తో చేసిన ‘భారత్’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కత్రినా ప్రస్తుతం దర్శకుడు రోహిత్‌ శెట్టి తీస్తున్న ‘సూర్యవంశీ’లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు