మే 8న రవితేజ ‘క్రాక్’తో రానున్నాడు !

మే 8న రవితేజ ‘క్రాక్’తో రానున్నాడు !

Published on Jan 26, 2020 9:57 AM IST

ఇదివరకు తమ కాంబినేషనులో రెండు బ్లాక్ బస్టర్లు అందించిన మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, మూడోసారి కలిసి పనిచేస్తోన్న సినిమా ‘క్రాక్’. దీంతో తమ కాంబినేషనులో హ్యాట్రిక్ కొట్టడానికి వారు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

రవితేజ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ‘క్రాక్’ మూవీని మే 8న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ పోస్టరును విడుదల చేశారు. ఈ పోస్టరులో రవితేజ ఖాకీ డ్రస్సులో వెహికిల్ నుంచి బయటకు వస్తూ, బదాస్ గా కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తోన్న ‘క్రాక్’లో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాల మేళవింపుతో, ఒక ఇంటెన్స్ స్టోరీతో ఈ సినిమా తయారవుతోంది.

రెండు శక్తిమంతమైన పాత్రల్ని తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్ కుమార్ పోషిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘మెర్సాల్’, ‘బిజిల్’ వంటి సూపర్ హిట్ తమిళ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు ‘క్రాక్’ కు డీఓపీగా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు