మలయాళంలో తెరకెక్కిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్గా ‘ఎల్2 ఎంపురాన్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు కమ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించాడు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో మరోసారి తనదైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇక ఈ సినిమా రిలీజ్కు ముందే అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ రూపంలో భారీ వసూళ్లు సాధించింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ‘ఎల్2 ఎంపురాన్’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఏప్రిల్ 24 నుంచి ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలవడంతో, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడలో స్ట్రీమింగ్కు రానుంది.