“వీరసింహా రెడ్డి” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

“వీరసింహా రెడ్డి” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Nov 8, 2022 10:07 AM IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుండగా మాస్ ఆడియెన్స్ లో ఈ చిత్రంపై అనేక అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై అయితే ఇప్పుడు వరుస షూట్ ప్రోగ్రెస్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

మరి రేపు నవంబర్ 9 నుంచి సినిమా షూటింగ్ ని అయితే మేకర్స్ అనంతపూర్ లో స్టార్ట్ చేయనుండగా నవంబర్ 9న పెన్నోబిలం లక్ష్మి నరసింహ స్వామి గుడి వద్ద అలాగే 10,11 న అమిద్యాల, రాకెట్ల అలాగే ఉరవకొండ ప్రాంతాల్లో జరగనుంది. ఇక తర్వాత 12 మరియు 13 తేదీల్లో ఈ చిత్రం పెనుగొండ కోట దగ్గర షూటింగ్ ని జరపనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు