క్రేజీ సీక్వెల్ నుండి క్రేజీ అప్ డేట్ !

క్రేజీ సీక్వెల్ నుండి క్రేజీ అప్ డేట్ !

Published on May 3, 2021 4:56 PM IST


డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన భారీ యాక్షన్‌ చిత్రం ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’. తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా విడుదలైంది. కార్తీ, రీమాసేన్, ఆండ్రియా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి హిట్ అయింది. అందుకే పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ చేయబోతున్నాడు సెల్వరాఘవన్. ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు కూడా. ఇక ఈ సీక్వెల్‌ లో ధనుష్ హీరోగా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో కూడా భారీ విజువల్స్ ఉండబోతున్నాయట.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం ఒక దివిలో జరుగుతుందట. అలాగే క్లైమాక్స్ ను పూర్తిగా నాగ లోకంలో జరుగుతున్నట్టు చూపిస్తారని.. సినిమాలో విజువల్స్ తో పాటు ఎమోషన్ కూడా చాల బలంగా ఉంటుందని తెలుస్తోంది. సెల్వరాఘవన్ ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేశాడని.. ప్రస్తుతం గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్ చేయిస్తున్నాడని తెలుస్తోంది. కోలీవుడ్ లో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ లో నిర్మించబోయే ఈ సినిమాని 2024 లో విడుదలచేస్తారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు