రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లక్ష్మీబాంబ్‌’ !

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లక్ష్మీబాంబ్‌’ !

Published on Aug 26, 2019 7:11 PM IST

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ జంటగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2020 మే 22వ తేదీ ఈ సినిమా విడుదల కానుంది. ఇక రీమేక్ లో కామెడీ సన్నివేశాలు బాగా వచ్చాయని చిత్రబృందం చెబుతుంది.

ఇక ‘లక్ష్మీబాంబ్‌’ సినిమాకు దర్శకత్వం వహించటానికి లారెన్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేసాడట. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ – కియరా అద్వానీ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా చాల ఫన్నీగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు షబీనా ఖాన్, తుషార్ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు