శ్రీనివాస్ సాయి, భావన రావు జంటగా అజయ్ సాయి మనికందన్ దర్శకత్వంలో కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యా ప్రసాద్, అశోక్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం మథనం. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సురేందర్రెడ్డి దంపతులు టీజర్ని విడుదల చేశారు. మొత్తానికి టీజర్ ఇంట్రస్టింగ్ గానే ఉంది. నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది.
ఈ సందర్బంగా దర్శకుడు సురేందర్రెడ్డి మాట్లాడుతూ, నిర్మాత అశోక్ దాదాపు 15ఏండ్లుగా తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం. నాతోపాటు కథా చర్చల్లో కూడా పాల్గొనేవాడు. తనకి సినిమాపై మంచి పట్టుంది. సినిమాల్లో ఏదైనా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. తర్వాత మధ్యలో వదిలేసి అమెరికా వెళ్ళి బాగా సంపాదించారు. ఏడేండ్ల తర్వాత సడెన్గా వచ్చి సినిమా చేస్తున్నా అని చెప్పారు. తను మళ్ళీ సినిమాలు చేస్తాడనుకోలేదు. ఆయన గట్స్ ని మెచ్చుకోవాలి. టీమ్ అంతా ఎంతో కష్టపడి సినిమా చేశారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. సినిమాకిదే ప్లస్ అవుతుంది. పెద్ద విజయం సాధించాలని, అశోక్ పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నా అని చెప్పారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి