మహేష్.. కాశ్మీర్ షెడ్యూల్ లో టైటిల్ సాంగ్ !

మహేష్.. కాశ్మీర్ షెడ్యూల్ లో టైటిల్ సాంగ్ !

Published on Jul 3, 2019 3:28 PM IST

మహేశ్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ రేపటి నుండి కాశ్మీర్ లో రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతుంది. ఈ కాశ్మీర్ షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొనబోతుందట. కాగా ఈ షెడ్యూల్ లో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే సన్నివేశాలనే మాత్రామే షూట్ చేయనున్నారు. అదే విధంగా టైటిల్ సాంగ్ ‘సరిలేరు నీకెవ్వరు’ను కూడా తీయనున్నారు.

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే జగపతి బాబు కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు