మార్చ్1న ‘మనసా వాచా’ వచ్చేస్తోంది!

మార్చ్1న ‘మనసా వాచా’ వచ్చేస్తోంది!

Published on Feb 14, 2019 3:00 PM IST

గణేష్ క్రియేషన్స్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి ఎం.వి. ప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తేజస్-కరిష్మా కర్పాల్-సీమా పర్మార్ హీరోహీరోయిన్స్ గా నిశ్చల్ దేవా-లండన్ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం ‘మనసా.. వాచా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఎం.జి.ఎం (మినిమమ్ గ్యారంటీ మూవీస్) ద్వారా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు ఎం.వి.ప్రసాద్, నిర్మాతల్లో ఒకరైన నిశ్చల్ దేవా, హీరోయిన్ కరిష్మా కర్పాల్, ఎం.జి.ఎం అధినేత ఎం.అచ్చిబాబు పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు.

హీరో టర్నడ్ ప్రొడ్యూసర్ నిశ్చల్ దేవా మాట్లాడుతూ.. ‘లైఫ్ స్టైల్, తులసిదళం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన నేను.. కథ నచ్చడంతో ఈ సినిమాతో నిర్మాతగా మారాను. దర్శకుడు ఎం.వి.ప్రసాద్ ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. సినిమా మొత్తం లండన్ లో తీశాం.. అన్నారు.

హీరోయిన్ కరిష్మా కర్పాల్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా క్యారక్టర్ ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసారు డైరెక్టర్’ అన్నారు.

దర్శకుడు ఎం.వి.ప్రసాద్ మాట్లాడుతూ.. ‘జ్వరం, జలుబు వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎలా అయితే మందులు వేసుకుని.. ఆ వ్యాధులు నయం చేసుకుంటామో.. క్యాన్సర్ సోకినప్పుడు కూడా అంతే సులభంగా నయం చేసుకునేలా ఉండాలనే లక్ష్యంతో పని చేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనల సమాహారంగా ‘మనసా.. వాచా’ చిత్రాన్ని రూపొందించాం. రీసెర్చ్ స్కాలర్స్ గా తేజస్, కరిష్మా చాలా బాగా నటించారు. దర్శకుడిగా పరిచయమవుతున్న నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు.
ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఎం.జి.ఎం అధినేత అచ్చిబాబు మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా మా ఎం.జి.ఎం ద్వారా విడుదలవుతుండడం సంతోషంగా ఉంది. మార్చ్ 1న వీలైనన్ని ఎక్కువ ధియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు!!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు